భిక్కనూరులో టీఆర్ఎస్ పట్టణ నూతన కార్యవర్గం ఎన్నిక
ABN , First Publish Date - 2021-09-03T04:54:51+05:30 IST
భిక్కనూరు టీఆర్ఎస్ పట్టణ నూతన కార్య వర్గాన్ని ఎన్నుకున్నట్లు టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు భగవంత్రెడ్డి గురువా రం తెలిపారు.
![భిక్కనూరులో టీఆర్ఎస్ పట్టణ నూతన కార్యవర్గం ఎన్నిక](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
భిక్కనూరు, సెప్టెంబరు 2: భిక్కనూరు టీఆర్ఎస్ పట్టణ నూతన కార్య వర్గాన్ని ఎన్నుకున్నట్లు టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు భగవంత్రెడ్డి గురువా రం తెలిపారు. పట్టణ బీసీసెల్ అధ్యక్షుడిగా దేవయ్య, ఎస్సీసెల్ అధ్యక్షుడిగా రవి, ఎస్టీసెల్ అధ్యక్షుడిగా పోచయ్య, రైతువిభాగం అధ్యక్షుడిగా జనార్దన్ రె డ్డిని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గాల్రెడ్డి, స ర్పంచ్ వేణు, ఆలయకమిటీ చైర్మన్ మహేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
టీఆర్ఎస్ గ్రామ కమిటీ ఎన్నిక
దోమకొండ: మండలంలోని ఆయా గ్రామాల ఇన్చార్జిల ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నూతన కమిటీలను ఎన్నుకున్నట్లు టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఐరేని నర్సయ్య తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీ తీర్మల్గౌడ్, సర్పంచ్లు సలీం, సమత, ఎంపీటీసీలు పిరాంగి రాజేశ్వర్, దోర్నల లక్ష్మీ, లక్ష్మణ్, రంగ గౌని శ్రీనివాస్గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
పెద్దకొడప్గల్ గ్రామ టీఆర్ఎస్ అధ్యక్షుడి ఎన్నిక
పెద్దకొడప్గల్: పెద్దకొడప్గల్ గ్రామ టీఆర్ఎస్ అధ్యక్షుడిగా వీరేశంను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఎంపీపీ ప్రతాప్రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు హన్మంత్రెడ్డి, సర్పంచ్ తిర్మల్రెడ్డి, నాయకులు సంగ మేశ్వర్, ఎల్లయ్య, జాఫర్ తదితరులు పాల్గొన్నారు.