సకాలంలో ధరణి రిజిస్ట్రేషన్లు జరపాలి

ABN , First Publish Date - 2021-08-28T04:52:53+05:30 IST

రైతులకు అసౌకర్యం కలుగకుండా సకాలంలో ధరణి రిజిస్ట్రేషన్లు జరపాలని, ధరణి పెండింగ్‌ దరఖాస్తులు వచ్చే సోమవారం వరకు పూర్తి చేయాలని కలెక్టర్‌ శరత్‌ రెవెన్యూ అధికారులను ఆదేశించారు.

సకాలంలో ధరణి రిజిస్ట్రేషన్లు జరపాలి
వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడుతున్న కలెక్టర్‌ శరత్‌

కామారెడ్డి, ఆగస్టు 27: రైతులకు అసౌకర్యం కలుగకుండా సకాలంలో ధరణి రిజిస్ట్రేషన్లు జరపాలని, ధరణి పెండింగ్‌ దరఖాస్తులు వచ్చే సోమవారం వరకు పూర్తి చేయాలని కలెక్టర్‌ శరత్‌ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అధి కారులతో మాట్లాడుతూ ధరణి రిజిస్ట్రేషన్లకు సంబంధించి ఉదయం పదిన్నర గంటలకు స్లాట్‌బుక్‌ అవుతున్నందున తహసీల్ధార్‌లు ఉదయం 10.20కి లాగిన్‌ అయి ఉండాలని తెలిపారు. పెండి ంగ్‌ దరఖాస్తులను ఆర్‌డీఓలు డివిజన్‌ స్థాయి సమావేశాలు ఏర్పాటు చేసుకుని పెండింగ్‌ దరఖాస్తులకు కారణాలు విశ్లేషించుకోవాలని, దరఖాస్తులను సత్వరమే పరిష్కరించి తగిన చర్యలు చేపట్టాలని తెలిపారు. గత ఖరీఫ్‌, రబీకి సంబంధించిన సీఎంఆర్‌ మిల్లింగ్‌ పనుల ద్వారా పూర్తయ్యేందుకు రెవెన్యూ, పౌర సరఫరాల అధికారులు క్షేత్ర స్థాయిలో పకడ్బందీగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలో 38 బాయిల్డ్‌ రైస్‌మిళ్లులతో కలిపి 165 మిల్లుల ద్వారా సీఎంఆర్‌ మిల్లింగ్‌ చేపట్టినట్లు తెలిపారు. ప్రతీ రైస్‌మిల్‌కు ఒక సూపర్‌వైజర్‌ అధికారితో పాటు ముగ్గురు వీఆర్‌వోలను నియమించాలని, రోజుకు 24 గంటలు మిల్లింగ్‌ చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతిరోజూ ఎంత అనేది ముందుస్తు కార్యాచరణతో లక్ష్యాన్ని సాధించాలని తెలిపారు. ఇప్పటి వరకు ఖరీఫ్‌కు సంబ ంధించి 85 శాతం, రబీకి సంబంధించి 15 శాతం పూర్తి అయిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డీఓలు శ్రీను, జిల్లా పౌర సరఫరాల అధికారి రాజశేఖర్‌, ఏవో రవీందర్‌, సూపరిటెండెంట్‌ నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-08-28T04:52:53+05:30 IST