‘అవినీతి టీఆర్ఎస్ నేతలకు జైలు తప్పదు’
ABN , First Publish Date - 2021-01-25T05:40:34+05:30 IST
అవినీతి టీఆర్ఎస్ నేతలకు జైలు తప్పదని బీజేపీ అధికారంలోకి వచ్చాక టీఆర్ఎస్ నేతల అవినీతిపై విచారణ చేయిస్తామని బీజేపీ నేతలు హెచ్చరించారు.
బోధన్, జనవరి 24 : అవినీతి టీఆర్ఎస్ నేతలకు జైలు తప్పదని బీజేపీ అధికారంలోకి వచ్చాక టీఆర్ఎస్ నేతల అవినీతిపై విచారణ చేయిస్తామని బీజేపీ నేతలు హెచ్చరించారు. ఆదివారం బోధన్లో బీజేపీ జిల్లా నాయకులు మేడపాటి ప్రకాష్రెడ్డి ఇంట్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎంపీ అర్వింద్పై టీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఎంపీగా కవిత జిల్లాకు ఏం చేశారని, అర్వింద్ ఏం చేశారో తాము చెప్పేందుకు సిద్ధంగా ఉ న్నామని చర్చలకు రావాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో ఇసుక, మొ రం ఇతర అక్రమ వ్యాపారాలు చేస్తున్న టీఆర్ఎస్ నేతలు, వారి వద్ద కమిషన్లు వసూలు చేస్తున్న నేతలను వదిలేది లేదని హెచ్చరించారు. టీఆర్ఎస్ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలని లేనట్లయితే తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు. తెలంగాణలో రానున్నది హిందూ రాజ్యమని బోధన్లో కాషాయం జెండా ఎగు రనుందని హిందూ సోదరులంతా ఒకేతాటిపైకి రావాలన్నారు. సమావేశంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు బాల్రాజ్, నియోజకవర్గ నాయకులు న్యావనంది గోపాల్, ఎడపల్లి మండల పార్టీ అధ్యక్షుడు కమలాకర్, మాజీ కౌన్సిలర్ రామరాజు, బొడ్డురవి, గుంత గంగాధర్, సింది విజయ్, వాసు, ముద్ద ఈర్వంత్రావు తదితరులు పాల్గొన్నారు.