ఆలయ భూముల్లో నిర్మాణాలు చేపట్టరాదు

ABN , First Publish Date - 2021-04-23T05:17:22+05:30 IST

సదాశివనగర్‌ విశ్వేశ్వరస్వామి ఆలయ భూముల్లో సర్వేనంబర్‌ 887లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టారాదని దేవదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ సోమయ్య తెలిపారు.

ఆలయ భూముల్లో నిర్మాణాలు చేపట్టరాదు

సదాశివనగర్‌, ఏప్రిల్‌ 22: సదాశివనగర్‌ విశ్వేశ్వరస్వామి ఆలయ భూముల్లో సర్వేనంబర్‌ 887లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టారాదని దేవదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ సోమయ్య తెలిపారు. సదాశివనగర్‌లో గురువారం ఆల య భూముల్లో నిర్మాణం చేస్తున్న స్థలం వద్ద హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి ఏవో వెంకటనారాయణ, సిబ్బంది సురేందర్‌, రాములు, లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-23T05:17:22+05:30 IST