బాసర వద్ద మరో వంతెన నిర్మించండి
ABN , First Publish Date - 2021-07-25T06:11:47+05:30 IST
తెలంగాణలోని ప్ర ముఖ పుణ్యక్షేత్రం కొలువైన బాసర వద్ద గోదావరిపై మరో వంతెన నిర్మించాలని ఎంపీ ధర్మపురి అర్వింద్ కేం ద్ర రవాణాశాఖ మంత్రి నితిన్గడ్కరీ ని కోరారు.
కేంద్రమంత్రి గడ్కరీకి ఎంపీ ధర్మపురి అర్వింద్ వినతి
నిజామాబాద్, జూలైౖ 24 (ఆంధ్ర జ్యోతి ప్రతినిధి): తెలంగాణలోని ప్ర ముఖ పుణ్యక్షేత్రం కొలువైన బాసర వద్ద గోదావరిపై మరో వంతెన నిర్మించాలని ఎంపీ ధర్మపురి అర్వింద్ కేం ద్ర రవాణాశాఖ మంత్రి నితిన్గడ్కరీ ని కోరారు. కేంద్ర ప్రభుత్వం రూ.600 ల కోట్లతో బోధన్, బాసర, భైంసా మీ దుగా కొత్తగా 161 బీబీ జాతీయ రహదారిని ప్రకటించడం పట్ల గడ్కరికీ అర్వి ంద్ కృతజ్ఞతలు తెలిపారు. కాగా.. దసరా నవరాత్రి, వసంత పంచమి, సంక్రాం తి, గోదావరి పుష్కరాల సమయంలో బాసర వద్ద ట్రాఫిక్జామ్ తీవ్రంగా ఉం టుందని, మరో బ్రిడ్జి నిర్మిస్తే సౌలభ్యంగా ఉంటుందని ఆయన మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఉన్న బ్రిడ్జి 1980లో నిర్మించారని, అది వెడల్పు ఏడున్నర మీటర్లు మాత్రమే ఉండడంతో నిత్యం ట్రాఫిక్ జామ్ అవుతోందన్నారు. పుణ్యక్షేత్రానికి భక్తుల తాకిడి పెరిగిన దృష్ట్యా 3 నుంచి 5 కి.మీ వరకు నాలుగు వరస ల అప్రోచ్ రోడ్ను నిర్మించాలని ఆయన మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.