గణతంత్ర దినోత్సవానికి ఏర్పాట్లు చేయాలి
ABN , First Publish Date - 2021-01-24T05:27:53+05:30 IST
గణతంత్ర దినోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ సంబంధిత అధికారులకు సూచించారు. శనివారం అధికారులతో గణతంత్రదినోత్సవ ఏర్పాట్లపై సెల్కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.
నిజామాబాద్ అర్బన్, జనవరి 23: గణతంత్ర దినోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ సంబంధిత అధికారులకు సూచించారు. శనివారం అధికారులతో గణతంత్రదినోత్సవ ఏర్పాట్లపై సెల్కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. కోవిడ్ నేపథ్యంలో అన్ని జాగ్రత్తలతో సాదాసీదాగా వేడుకలు నిర్వహించుకునేలా ఏర్పాట్లు చేయాలని ఎప్పుడు నిర్వహించే సమయానికే వారి కార్యాలయాల్లో చేసుకున్న తర్వాత పోలీస్ ఫరేడ్ గ్రౌండ్కు జిల్లా అధికారులు, సిబ్బంది హాజరు కావాలన్నారు. వ్యవసాయ, ఉద్యానవనశాఖ ఆధ్వర్యంలో, పల్లెప్రగతి, మిషన్ భగీర థ, పట్టణ ప్రగతి, హరితహారం తదితర కార్యక్రమాలపై శకటాలను తయారుచేయాలని ఆదేశించారు. అందరికీ ఆహ్వానం అందే విధంగా చూడాలని తెలిపారు. ప్రశంసాపత్రాలు, విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఈసారి ఉండవన్నారు.