మామను చంపిన కేసులో అల్లుడికి జైలు శిక్ష
ABN , First Publish Date - 2021-10-30T05:19:54+05:30 IST
మామను చంపిన కేసులో అల్లుడికి ఐదు సంవత్సరాల జైలు శిక్ష పడింది. వివరాల్లోకి వెళితే.. కామారెడ్డి మండలంలోని లింగాపూర్ గ్రామానికి చెందిన ఎనగుర్తి రాజలింగం, అల్లుడు ఎనగుర్తి లక్ష్మణ్ మధ్య విబేధాలు చోటు చేసుకున్నాయి.
కామారెడ్డి, అక్టోబరు 29: మామను చంపిన కేసులో అల్లుడికి ఐదు సంవత్సరాల జైలు శిక్ష పడింది. వివరాల్లోకి వెళితే.. కామారెడ్డి మండలంలోని లింగాపూర్ గ్రామానికి చెందిన ఎనగుర్తి రాజలింగం, అల్లుడు ఎనగుర్తి లక్ష్మణ్ మధ్య విబేధాలు చోటు చేసుకున్నాయి. దీంతో మద్యం మత్తులో మామను గొడ్డలితో అల్లుడు హత్య చేశాడు. దేవునిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిపై చార్జిషిట్ దాఖలు చేసి సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు. నేరం రుజువు కావడంతో నింధితుడికి కామారెడ్డి 9వ అదనపు జిల్లా న్యాయమూర్తి సీహెచ్ రమేష్బాబు ఐదు సంవత్సరాల కఠిన కారగార శిక్ష విధించినట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ నందరమేష్ తెలిపారు. హత్యచేసిన ఘటనలో శుక్రవారం పోలీసుల తరపున పబ్లిక్ ప్యాసిక్యూటర్ వాదనలు వినిపించారు.