Yadadri: గుర్తుతెలియని వాహనం ఢీకొని వృద్ధురాలు మృతి

ABN , First Publish Date - 2021-07-19T19:32:07+05:30 IST

జిల్లాలోని చౌటుప్పల్ మండలం మల్కాపురం స్టేజి వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధురాలు మృతి చెందింది.

Yadadri: గుర్తుతెలియని వాహనం ఢీకొని వృద్ధురాలు మృతి

యాదాద్రి-భువనగిరి: జిల్లాలోని చౌటుప్పల్ మండలం మల్కాపురం స్టేజి వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధురాలు మృతి చెందింది. యాదమ్మ(65) అనే వృద్ధురాలు బస్సు దిగి రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యాదమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. జాతీయ రహదారిపై కాకుండా బస్సు గ్రామంలోకి వస్తే ఈ ప్రమాదం జరిగేది కాదంటూ మృతదేహంతో జాతీయ రహదారిపై గ్రామస్తులు ధర్నాకు దిగారు. దీంతో హైదరాబాద్-విజయవాడ 65వ జాతీయ రహదారిపై 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. 

Updated Date - 2021-07-19T19:32:07+05:30 IST