అర్హులైన ప్రతీ ఒక్కరికి వ్యాక్సిన్ ఇవ్వాలి : కలెక్టర్ పీజే.పాటిల్
ABN , First Publish Date - 2021-10-28T05:33:50+05:30 IST
కరోనా వ్యాప్తి చెందకుండా 18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరికి వ్యాక్సిన్ ఇవ్వాలని, అందుకు ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ ప్రశాంత్జీవన్ పాటిల్ అన్నారు.

నల్లగొండ టౌన్, అక్టోబరు 27: కరోనా వ్యాప్తి చెందకుండా 18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరికి వ్యాక్సిన్ ఇవ్వాలని, అందుకు ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ ప్రశాంత్జీవన్ పాటిల్ అన్నారు. కలెక్టర్ కార్యాలయం నుంచి బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో వ్యాక్సినేషన్ డ్రైవ్, వైకుంఠధామాలు, నర్సరీలు, తదితర అంశాలను సమీక్షించి పలు సూచనలు చేశారు. ఇటీవల ఇతర దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్నందున అధికారులంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రత్యేక బృందాలు ఇంటింటి సర్వే నిర్వహించి వ్యాక్సిన్ ఇస్తాయని సిబ్బందికి అధికారులు సహకరించాలన్నారు. నవంబరు 3లోగా నూరుశాతం వ్యాక్సినేషన్ పూర్తవ్వాలన్నారు. అదేవిధంగా పంచాయతీల్లో మొక్కల పెంపకానికి ఏర్పాట్లు చేసుకోవాలని, వచ్చే 4వ తేదీలోగా వైకుంఠధామాల పను లు పూర్తిచేయాలన్నారు. వీడియో కాన్ఫరెన్సులో డీఆర్డీవో, జడ్పీ సీఈవో, డీపీవో, తదితరులు పాల్గొన్నారు.