సమష్టి కృషితోనే 100 కోట్ల మందికి వ్యాక్సినేషన్‌

ABN , First Publish Date - 2021-10-29T05:56:35+05:30 IST

సమష్టి కృషితోనే దేశంలో 100 కోట్ల మందికి వ్యాక్సినేషన్‌ పూర్తి అయినట్లు ఎయిమ్స్‌ డైరెక్టర్‌ వికాస్‌ భాటియా అన్నారు.

సమష్టి కృషితోనే 100 కోట్ల మందికి వ్యాక్సినేషన్‌
ఎయిమ్స్‌ ప్రధాన గేటు వద్ద బెలూన్‌ ఎగురవేస్తున్న వికాస్‌భాటియా

ఎయిమ్స్‌ డైరెక్టర్‌ వికాస్‌భాటియా 

బీబీనగర్‌, అక్టోబరు 28: సమష్టి కృషితోనే దేశంలో 100 కోట్ల మందికి వ్యాక్సినేషన్‌ పూర్తి అయినట్లు ఎయిమ్స్‌ డైరెక్టర్‌ వికాస్‌ భాటియా అన్నారు. దేశంలో 100 కోట్ల మందికి వ్యాక్సినేషన్‌ పూర్తయిన సందర్భంగా ఎయిమ్స్‌లో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 130 కోట్ల జనాభా కలిగిన భారత దేశంలో అనతికాలంలోనే వంద కోట్ల మందికి వ్యాక్సినేషన్‌ చేయడం హర్షణీయమన్నారు. అంతకుముందు ఎయిమ్స్‌ ప్రధాన ద్వారం ఎదుట ‘వ్యాక్సినేటెడ్‌ అమాంగ్‌ 100 క్రోర్స్‌’ అని రాసిన బెలూన్లను ఆకాశంలో ఎగురవేశారు.  

Updated Date - 2021-10-29T05:56:35+05:30 IST