విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తున్న టీఆర్ఎస్: బీజేపీ
ABN , First Publish Date - 2021-01-13T05:24:00+05:30 IST
విద్యారంగాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్రావు, పట్టభద్రుల ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్రెడ్డి ఆరోపించారు.

సూర్యాపేటటౌన్, జనవరి 12: విద్యారంగాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్రావు, పట్టభద్రుల ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్రెడ్డి ఆరోపించారు. ఎస్వీ డిగ్రీ కళాశాల మైదానంలో మార్నింగ్ వాకర్స్ను మంగళవారం కలిసి ఓటును అభ్యర్థించారు. అనంతరం ఓ ఫంక్షన్హాల్లో కేజీ టూ పీజీ స్కూల్, కాలేజేస్, అధ్యాపకులతో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు.కార్యక్రమంలో నాయకులు తుక్కాని మన్మథరెడ్డి, రంగరాజు రుక్మారావు, అబీద్, నరే్షగౌడ్, నాగేశ్వర్రావు, సిద్దేశ్వర్, నర్సింహా, రాజశేఖర్, మమతారెడ్డి పాల్గొన్నారు.