కాంగ్రెస్, బీజేపీ నాయకులవి పగటి కలలు: Gutta
ABN , First Publish Date - 2021-08-21T15:20:50+05:30 IST
2023లో తమదే అధికారం అని కాంగ్రెస్, బీజేపీ నాయకులు పగటి కలలు కంటున్నారని మాజీ
నల్లగొండ: 2023లో తమదే అధికారం అని కాంగ్రెస్, బీజేపీ నాయకులు పగటి కలలు కంటున్నారని మాజీ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. శనివారం ఉదయం జిల్లాలో తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మళ్లీ టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని, కేసీఆరే సీఎం అని స్పష్టం చేశారు. ప్రజలు మెచ్చేలా జాతీయ, రాష్ట్ర స్థాయి నాయకులు మంచి భాషతో మాట్లాడాలని హితవుపలికారు. బీజేపీ పెట్రో, గ్యాస్ ధరలు పెంచి ప్రజలపై భారం వేసిందన్నారు. హైదరాబాద్లో తాలిబాన్లు ఉన్నారని చెబుతున్నారని.... మరి ఎన్ఐఏ ఏం చేస్తుందని ప్రశ్నించారు. మతోన్మాదం పేరుతో శాంతియుతంగా ఉన్న రాష్ట్రంలో సమస్యలు సృష్టించి రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారని గుత్తా సుఖేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.