కలప రవాణా చేస్తున్న మూడు లారీలు సీజ్
ABN , First Publish Date - 2021-10-29T06:51:01+05:30 IST
కలప అక్రమంగా రవాణా చేస్తున్న మూడు లారీలను గురువారం అటవీ అధికారులు చౌటుప్పల్లో సీజ్ చే శారు.
చౌటుప్పల్టౌన, అక్టోబరు 28: కలప అక్రమంగా రవాణా చేస్తున్న మూడు లారీలను గురువారం అటవీ అధికారులు చౌటుప్పల్లో సీజ్ చే శారు. ఖమ్మం, సూర్యాపేట నుంచి హైదరాబాద్కు టేకు, మామిడి, బత్తా యి కర్రలను తరలిస్తున్న మూడు లారీలను ఫారెస్ట్ రేంజర్ వెంకట్రాము లు ఆధ్వర్యంలో పట్టుకొని సీజ్ చేశారు. అదేవిధంగా సంస్థాననారాయణపురం మండలంలోని రాచకొండ రిజర్వ్ ఫారె్స్టలో అక్రమ రోడ్డు నిర్మాణానికి ఉపయోగిస్తున్న ఎక్స్కవేటర్ను సీజ్ చేశారు. ఈ వాహనాలకు తగి న జరిమానాలను విధించేందుకు డీఎ్ఫవో వెంకటేశ్వర్రెడ్డికి నివేదిక అం దజేసినట్లు రేంజర్ వెంకట్రాములు తెలిపారు.