తెలంగాణ ఉద్యమాన్ని ప్రతిబింబించిన నవల ‘పొత్తి’

ABN , First Publish Date - 2021-09-15T07:43:57+05:30 IST

తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ మనుషుల తత్వాన్ని చిత్రీకరించిన అరుదైన నవల ‘పొత్తి’ అని యువజన నాయకుడు రాపోలు రాజశేఖర్‌ అన్నారు.

తెలంగాణ ఉద్యమాన్ని ప్రతిబింబించిన నవల ‘పొత్తి’

రామన్నపేట, సెప్టెంబరు 14: తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ మనుషుల తత్వాన్ని చిత్రీకరించిన అరుదైన నవల ‘పొత్తి’ అని యువజన నాయకుడు రాపోలు రాజశేఖర్‌ అన్నారు.  ఓయూ రీసెర్చ్‌ స్కాలర్‌ నర్రా ప్రవీణ్‌ రెడ్డి రచించిన ‘పొత్తి’ నవలను రామన్నపేట జూనియర్‌ కళాశాలలో మంగళవారం  ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అనంతరం ప్రవీణ్‌రెడ్డిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో  కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ కె.శివకోటి, కళ్లెం ధర్మనీల, షేక్‌ షబ్బీర్‌, బైరబోయిన రమేష్‌, శ్రీనివాస్‌రెడ్డి, సుబ్బారావు, గోపికృష్ణ లు పాల్గొన్నారు. 



Updated Date - 2021-09-15T07:43:57+05:30 IST