వైభవంగా లక్ష్మీనరసింహుడి కల్యాణం

ABN , First Publish Date - 2021-10-22T06:07:19+05:30 IST

లక్ష్మీనరసింహుడి క్షేత్రంలో స్వామివారి నిత్యకల్యాణాన్ని వేదపండితులు గురువారం వైభవంగా నిర్వహించారు. ఆలయంలో విశ్వక్ష్సేన పూజ, పుణ్యాహావాచనం, రక్షాబంధనం, రుత్విగ్వరణం, పంచగవ్వప్రాసన నిర్వహించారు. భక్తులకు నీరాజన

వైభవంగా లక్ష్మీనరసింహుడి కల్యాణం
కల్యాణం జరిపిస్తున్న వేద పండితులు

మఠంపల్లి, అక్టోబరు 21: లక్ష్మీనరసింహుడి క్షేత్రంలో స్వామివారి నిత్యకల్యాణాన్ని వేదపండితులు గురువారం వైభవంగా నిర్వహించారు. ఆలయంలో విశ్వక్ష్సేన పూజ, పుణ్యాహావాచనం, రక్షాబంధనం, రుత్విగ్వరణం, పంచగవ్వప్రాసన నిర్వహించారు. భక్తులకు నీరాజనమంత్రపుష్పాలతో మహానివేధన గావించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త చెన్నూరిమట్టపల్లిరావు,విజయ్‌కుమార్‌, ఈవో సిరికొండ నవీన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-22T06:07:19+05:30 IST