Telangana: మంత్రాలు చేస్తున్నాడని వృద్ధుడిపై దాడి
ABN , First Publish Date - 2021-09-07T17:57:45+05:30 IST
సూర్యాపేట మండలం ఎర్కారం గ్రామంలో మంత్రాలు చేస్తున్నాడని వృద్ధుడిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు.
సూర్యాపేట: సూర్యాపేట మండలం ఎర్కారం గ్రామంలో మంత్రాలు చేస్తున్నాడని వృద్ధుడిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన వృద్ధుడిని స్థానికులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 1న ఎర్కారంలో మోదాల లింగయ్య(60)పై మంత్రాలు చేస్తున్నడనే నెపంతో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.