సూర్యాపేటలో కోటి విలువైన ప్రభుత్వ మద్యం పట్టివేత

ABN , First Publish Date - 2021-07-29T16:45:24+05:30 IST

జిల్లాలోని మఠంపల్లి మండల కేంద్రం జాన్‌పహాడ్ రోడ్‌లో అర్ధరాత్రి మద్యం లారీని పోలీసులు పట్టుకున్నారు.

సూర్యాపేటలో కోటి విలువైన ప్రభుత్వ మద్యం పట్టివేత

సూర్యాపేట: జిల్లాలోని మఠంపల్లి మండల కేంద్రం జాన్‌పహాడ్ రోడ్‌లో అర్ధరాత్రి మద్యం లారీని పోలీసులు పట్టుకున్నారు. లారీలో సుమారు రూ.కోటి విలువైన ప్రభుత్వ మద్యం పట్టుబడింది. మహబూబ్ నగర్ జిల్లా పెబ్బేరు నుండి ఖమ్మం జిల్లా మధిరకు మద్యాన్ని తరలిస్తున్నట్లు తెలుస్తోంది. డ్రైవర్ సొంత ఊరు మఠంపల్లి మండలం సుల్తానాపూర్ తండా కావడంతో లారీని ఇక్కడ తీసుకురాగా పోలీసులు పట్టుకున్నట్లు సమాచారం. ఏపీకి తరలిస్తుండగా పట్టుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పెద్దల ఒత్తిడితో ఎటువంటి కేసులు లేకుండా లారీని విడిచిపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.

Updated Date - 2021-07-29T16:45:24+05:30 IST