ఆన్‌లైన్‌ బోధనతో విద్యార్థులు నష్టపోయారు

ABN , First Publish Date - 2021-09-02T07:06:55+05:30 IST

కొవిడ్‌ దృష్ట్యా ఆన్‌లైన్‌ విద్యలో విద్యార్థులు రాణించలేకపోయారని, ప్రత్యేక తరగతుల ద్వారానే బోధించి విద్యార్థులను ప్రయోజకులను చేయాలని రాష్ట్ర బాలల హక్కుల కమిషన్‌ సభ్యుడు పొనుగోటి అంజన్‌రావు సూచించారు.

ఆన్‌లైన్‌ బోధనతో విద్యార్థులు నష్టపోయారు
మర్రిగూడ జడ్పీ పాఠశాల పరిసరాలను పరిశీలిస్తున్న అంజన్‌రావు

బాలల హక్కుల కమిషన్‌ సభ్యుడు పొనుగోటి అంజన్‌రావు 

మర్రిగూడ, సెప్టెంబరు 1: కొవిడ్‌ దృష్ట్యా ఆన్‌లైన్‌ విద్యలో విద్యార్థులు రాణించలేకపోయారని, ప్రత్యేక తరగతుల ద్వారానే బోధించి విద్యార్థులను ప్రయోజకులను చేయాలని రాష్ట్ర బాలల హక్కుల కమిషన్‌ సభ్యుడు పొనుగోటి అంజన్‌రావు సూచించారు. మర్రిగూడలోని ఆదర్శ పాఠశాల, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలలను సందర్శించి అక్కడ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాలా మంది విద్యార్థులు ఆన్‌లైన్‌ విద్యతో నష్టపోయారని చెప్పారు. విద్యార్థుల భవిష్యత్‌కు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనన్నారు. అనంతరం పలు పాఠశాలల ఉపాధ్యాయులతో ఆన్‌లైన్‌ విద్యా బోధనపై సమావేశం నిర్వహించి, పాఠశాలల్లో మౌలిక వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. వారివెంట జిల్లా విద్యాశాఖ అధికారి భిక్షపతి, మర్రిగూడ విద్యాశాఖ అధికారి గురువరావు, హెచ్‌ంలు శివ, స్వరూప, భిక్షమయ్య, సుమతి, కృష్ణ ఉన్నారు. 

Updated Date - 2021-09-02T07:06:55+05:30 IST