చెరువులు, కుంటలకు త్వరలో వేలం పాటలు
ABN , First Publish Date - 2021-12-02T06:16:53+05:30 IST
మత్స్యశాఖ పరిధిలోకి వచ్చిన జిల్లా లోని గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో ఉన్న చెరువులు, కుంటల్లో చేపల పెంపకానికి త్వరలో వేలం పాటలు నిర్వహిస్తామని జిల్లా మత్స్యశాఖ అధికారి సౌజన్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
సూర్యాపేట సిటీ, డిసెంబరు 1: మత్స్యశాఖ పరిధిలోకి వచ్చిన జిల్లా లోని గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో ఉన్న చెరువులు, కుంటల్లో చేపల పెంపకానికి త్వరలో వేలం పాటలు నిర్వహిస్తామని జిల్లా మత్స్యశాఖ అధికారి సౌజన్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మత్స్య పారి శ్రామిక సహకార సంఘాలు, పారిశ్రామిక సహకార సంఘాలు లేని గ్రామ పంచాయతీలకువేలం పాటలు నిర్వహిస్తామన్నారు. చెరువులు, కుంటాలపై గ్రామ పంచాయతీలకు ఎలాంటి అధికారం లేదన్నారు.