విద్యుదాఘాతంతో ఒకరు మృతి
ABN , First Publish Date - 2021-01-25T06:27:59+05:30 IST
ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో ఒకరు చెందారు. ఈ ఘటన ఆదివారం నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం వల్లాల గ్రామంలో జరిగింది.
నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం వల్లాల గ్రామంలో ..
శాలిగౌరారం, జనవరి 24: ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో ఒకరు చెందారు. ఈ ఘటన ఆదివారం నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం వల్లాల గ్రామంలో జరిగింది. ఎస్ఐ హరిబాబు తెలిపిన వివరాల ప్రకారం.. వల్లాల గ్రామానికి చెందిన దాసరి కృష్ణయ్య(45)తన ఇంటి ఆవరణలోని కొబ్బరి చెట్టు మట్టలను కత్తితో కొడుతుండగాప్రమాదవశాత్తు హైటెన్షన్ తీగలు తగిలి విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. కృష్ణ య్యకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ హరిబాబు తెలిపారు.