రెండు గేట్ల ద్వారా సాగర్‌ నీటి విడుదల

ABN , First Publish Date - 2021-10-29T06:06:57+05:30 IST

నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు నీటి మట్టం గురువారం 590 అడుగులుగా నమోదుకాగా, రెండు క్రస్ట్‌ గేట్ల నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 62,302క్యూసెక్కుల నీరు సాగర్‌

రెండు గేట్ల ద్వారా సాగర్‌ నీటి విడుదల
రెండు గేట్ల ద్వారా విడుదలవుతున్న నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు నీరు

590 అడుగుల వద్ద సాగర్‌ నీటి మట్టం 

నాగార్జునసాగర్‌/చింతలపాలెం, అక్ట్టోబరు 28: నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు నీటి మట్టం గురువారం 590 అడుగులుగా నమోదుకాగా, రెండు క్రస్ట్‌ గేట్ల నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు నుంచి  62,302క్యూసెక్కుల నీరు సాగర్‌కు వచ్చి చేరుతుండగా; సాగర్‌ నుంచి మొత్తం 82474క్యూసెక్కుల నీటిని విడు దల చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 47,797 క్యూసెక్కుల నీరు వస్తుండటంతో మూడు క్రస్ట్‌గేట్ల నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మూడు యూనిట్లను వినియోగిస్తూ 60మెగావాట్ల విద్యుదుత్పత్తి చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 175అడుగులు (45.77టీఎంసీలు) కాగా ప్రస్తుతం 168.89 అడుగులుగా (36.82టీఎంసీలు) నమోదైంది.

Updated Date - 2021-10-29T06:06:57+05:30 IST