ఎర్ర చొక్కా.. పంచెకట్టి...
ABN , First Publish Date - 2021-12-07T06:31:36+05:30 IST
పోచంపల్లిలో రెండు రోజుల పాటు జరుగుతున్న సీపీఎం జిల్లా మహాసభలకు రామన్నపేట మండలం నుం చి 40 మంది ప్రతినిధులు బయలుదేరారు.
![ఎర్ర చొక్కా.. పంచెకట్టి...](https://media.andhrajyothy.com/appimg/galleries/1921120701002315/12072021010106n78.jpg)
సీపీఎం జిల్లా మహాసభలకు తరలిన ప్రతినిధులు
రామన్నపేట, డిసెంబరు 6: పోచంపల్లిలో రెండు రోజుల పాటు జరుగుతున్న సీపీఎం జిల్లా మహాసభలకు రామన్నపేట మండలం నుం చి 40 మంది ప్రతినిధులు బయలుదేరారు. వామపక్ష పాలిత రాష్ట్రం కేర ళ వస్త్రధారణతో మండల ప్రతినిధులు ఎర్ర చొక్కా, తెల్ల పంచెలతో ప్ర త్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రతీ మూడేళ్లకొకసారి జరిగే సమావేశాల్లో జి ల్లాలోని ప్రజా సమస్యలపై పోరాట కార్యాచరణ రూపొందిస్తారని సీపీ ఎం జిల్లా కమిటీ సభ్యులు మేక అశోక్రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో జి ల్లా కమిటీ సభ్యుడు జల్లెల పెంటయ్య, మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెం కటేశ, నాయకులు కూరెళ్ల నర్సింహాచారి, బోయిని ఆనంద్, యాదాసు యాదయ్య, నాగటి ఉపేందర్, మామిడి వెంకట్రెడ్డి, అంజయ్య, హనుమంతు, నరేందర్, విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.