నిందితులను రిమాండ్‌ చేయాలి

ABN , First Publish Date - 2021-12-31T16:32:40+05:30 IST

దళిత యువతిపై లైంగికదాడికి పాల్పడిన నిందితులను అరెస్టు చేసి, రిమాండ్‌ చేయాలని బీఎస్పీ నాయకుడు పెండం ధనంజయ్య డిమాండ్‌ చేశారు.

నిందితులను రిమాండ్‌ చేయాలి

మర్రిగూడ, డిసెంబరు 30 : దళిత యువతిపై లైంగికదాడికి పాల్పడిన నిందితులను అరెస్టు చేసి, రిమాండ్‌ చేయాలని బీఎస్పీ నాయకుడు పెండం ధనంజయ్య డిమాండ్‌ చేశారు. నల్లగొండ జిల్లా మరిగ్రూడ పోలీ్‌సస్టేషన్‌ ఎదుట బీఎస్పీ ఆధ్వర్యంలో గురువారం నిరసన వ్యక్తం చేశారు. యువతి గర్భం దాల్చడానికి కారణమైన ఏడుగురు మంది నిందితుల్లో ఒకరిని మాత్రమే పోలీసులు అరెస్టు చేశారని; త్వరగా మిగతా వారిని అరెస్టు చేయాలని అన్నారు. యువతికి న్యాయం చేసేలా ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టును ఏర్పాటు చేసి నిందితులకు శిక్ష పడేలాచర్యలు తీసుకోవాలన్నారు. ఆందోళనలో బీఎస్పీ నియోజకవర్గం అధ్యక్షుడు సామ్రాట్‌ కిరణ్‌, జగన్నాథంగౌడ్‌, బొట్టుశివ, వెంకటే్‌షగౌడ్‌, స్వామి, ప్రవీన్‌, వెంకటేష్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-31T16:32:40+05:30 IST