ఆర్టీసీ బస్‌ ఢీకొనడంతో వ్యక్తి..

ABN , First Publish Date - 2021-06-23T07:41:13+05:30 IST

ఆర్టీసీ బస్‌ ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు.

ఆర్టీసీ బస్‌ ఢీకొనడంతో వ్యక్తి..

చౌటుప్పల్‌ రూరల్‌, జూన్‌22: ఆర్టీసీ బస్‌ ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. సీఐ శ్రీనివాస్‌ తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా హాలియా మండలం హాజరిగూడెం గ్రామానికి చెందిన ముత్యాల త్రిమూర్తులు(55) చౌటుప్పల్‌ మండలం అంకిరెడ్డిగూడెం స్టేజీ వద్ద హోటల్‌ నడుపుతున్నాడు. సోమవారం రాత్రి త్రిమూ ర్తులు రోడ్డు దాటుతుండగా,  హైదరాబాద్‌ నుంచి సూర్యాపేటకు వెళ్తున్న ఆర్టీసీ  ఢీ కొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన  త్రిమూర్తులు అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.


Updated Date - 2021-06-23T07:41:13+05:30 IST