ట్రాక్టర్‌ ట్యాంకర్‌ కింద పడి వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2021-07-27T06:08:59+05:30 IST

ట్రాక్టర్‌ ట్యాంకర్‌ కిందపడి వ్యక్తి మృతిచెందాడు. ఈ సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలంలోని ఖప్రాయిపల్లిలో సోమవారం జరిగింది.

ట్రాక్టర్‌ ట్యాంకర్‌ కింద పడి వ్యక్తి మృతి
నర్సింహ(ఫైల్‌)

ఆత్మకూరు(ఎం), జూలై 26: ట్రాక్టర్‌ ట్యాంకర్‌ కిందపడి వ్యక్తి మృతిచెందాడు. ఈ సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలంలోని ఖప్రాయిపల్లిలో సోమవారం జరిగింది. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలో పదిరోజుల క్రితం కొంగరి నర్సయ్య అనే వృద్ధుడు చనిపోయాడు. అతని ఇంటివద్ద సోమవారం  దశదిన కర్మ చేస్తున్నారు. స్నానాల కోసం అదే గ్రామానికి చెందిన కొంగరి నర్సింహ(38) ట్రాక్టర్‌ ట్యాంకర్‌తో నీళ్లు తెచ్చిపెట్టాడు. స్నానాలు చేసే సమయంలో ట్యాంకర్‌ను కొద్దిదూరంలో పెట్టాలని బంధువులు కోరారు. దీంతో నర్సింహ ట్రాక్టర్‌ అక్కడి నుంచి తీస్తున్న క్రమంలో ట్యాంకర్‌ టైర్‌ గుంతలో పడింది. దీంతో ట్యాంకర్‌తోపాటు ట్రాక్టర్‌ ఇంజన్‌ బోల్తా పడింది. డ్రైవింగ్‌ చేస్తున్న నర్సింహ ట్రాక్టర్‌ ఇంజన్‌ కింది ఇరుక్కుపోయాడు. అక్కడున్న వారు వెంటనే నర్సింహను బయటికి తీసి మోత్కూరులోని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. నర్సింహకు భార్య, కుమార్తె, కుమారుడు, ఉన్నారు. భార్య సంతోష ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మధు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 

Updated Date - 2021-07-27T06:08:59+05:30 IST