నిర్వాసితులకు న్యాయం చేయాలి

ABN , First Publish Date - 2021-12-30T16:42:29+05:30 IST

భూపరిహారం, పునరావాసం కల్పించాలంటూ నర్సిరెడ్డిగూడెం ముంపు గ్రామ భూనిర్వాసితు లు చేస్తున్న ధర్నా 50 రోజులు దాటినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం..

నిర్వాసితులకు న్యాయం చేయాలి

మర్రిగూడ, డిసెంబరు 29: భూపరిహారం, పునరావాసం కల్పించాలంటూ నర్సిరెడ్డిగూడెం ముంపు గ్రామ భూనిర్వాసితు లు చేస్తున్న ధర్నా 50 రోజులు దాటినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం విచారకరమని డీసీసీ ఉపాధ్యక్షు డు, మాజీ ఎంపీపీ అనంతరాజుగౌడ్‌ అన్నారు. బుధవారం ఆయన విలేకరుల తో మాట్లాడారు. చర్లగూడెం రిజర్వాయర్‌ పనులు ప్రారంభించి ఏడే ళ్లు దాటినా  ఇప్పటివరకు ప్రభుత్వం ముంపు గ్రామాల బాధితులకు పునరావాసం, పరిహారం కల్పించకపోవడం బాధాకరమన్నారు. భూనిర్వాసితులు చేపట్టిన ధర్నా 50 రోజులకు చేరుకు న్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లుగా కూడా లేదని ఆరోపించా రు. ప్రభుత్వం మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు బాధితులకు ఒక రీతిగా, డిండి ఎత్తిపోతల ప్రాజెక్టు బాధితులకు మరోవిధంగా పరిహారం అందించడం అన్యాయమన్నారు. ప్రభుత్వం స్పందించి బాధితుల కు పునరావాసం, ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ అందించాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో భాస్కర్‌, వెంకటేష్‌, యాదయ్య, నర్సింహ, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.     

Updated Date - 2021-12-30T16:42:29+05:30 IST