తేనెటీగల పెంపకంతో అధిక ఆదాయం
ABN , First Publish Date - 2021-10-28T05:41:48+05:30 IST
తేనెటీగల పెంపకంతో అధిక ఆదాయం పొందవచ్చని డీఆర్డీఏ పీడీ సుందరి కిరణ్కుమార్ అన్నా రు. తేనెటీగల పెంపకంపై రైతులు, యువతకు మండలంలోని గడ్డిపల్లి కేవీకేలో బుధవారం నిర్వహించిన శిక్షణలో ఆయన మాట్లాడారు. తేనెటీగలతో వ్యవసాయ ఉద్యాన పంటలకు ఎంతో ఉపయోగం దీని ద్వారా పంటల దిగుబడి పెరుగుతుందని అ

గరిడేపల్లి రూరల్, అక్టోబరు 27: తేనెటీగల పెంపకంతో అధిక ఆదాయం పొందవచ్చని డీఆర్డీఏ పీడీ సుందరి కిరణ్కుమార్ అన్నా రు. తేనెటీగల పెంపకంపై రైతులు, యువతకు మండలంలోని గడ్డిపల్లి కేవీకేలో బుధవారం నిర్వహించిన శిక్షణలో ఆయన మాట్లాడారు. తేనెటీగలతో వ్యవసాయ ఉద్యాన పంటలకు ఎంతో ఉపయోగం దీని ద్వారా పంటల దిగుబడి పెరుగుతుందని అన్నారు. తేనె ద్వారా ఆదా యం పొందవచ్చని అన్నారు. శిక్షణ పొందిన రైతులు, యవకులకు సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో కేవీకే కార్యదర్శి ఘంటా సత్య నారాయణరెడ్డి, ప్రోగ్రాం కో ఆర్డినేటర్ బి.లవకుమార్, జిల్లా ఈజీఎం ఎం జాయింట్ డైరెక్టర్ మల్లేశ్యాదవ్, శాస్త్రవేత్తలు కిరణ్, సుగంధి, నరేష్ తదితరులు పాల్గొన్నారు.