ఘంటా గోపాల్రెడ్డి సేవలు మరువలేనివి
ABN , First Publish Date - 2021-01-16T05:16:59+05:30 IST
గరిడేపల్లి, పెన్పహాడ్ మండలాల రైతులకు కృషి విజ్ఞాన కేంద్రం స్థాపకుడు ఘంటా గోపాల్ రెడ్డి చేసిన సేవలు మరువలేనివని మహాత్మాగాంధీ ఎత్తిపోతల పథకం చైర్మన్ బిట్టు నాగేశ్వర్ రావు అన్నారు.
పెన్పహాడ్, జనవరి 15 : గరిడేపల్లి, పెన్పహాడ్ మండలాల రైతులకు కృషి విజ్ఞాన కేంద్రం స్థాపకుడు ఘంటా గోపాల్ రెడ్డి చేసిన సేవలు మరువలేనివని మహాత్మాగాంధీ ఎత్తిపోతల పథకం చైర్మన్ బిట్టు నాగేశ్వర్ రావు అన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా రైతాంగానికి గోపాల్రెడ్డి చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ రైతులతో కలిసి ఆయన దూపహాడ్లోని గోపాల్రెడ్డి విగ్రహానికి క్షీరాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో డైరెక్టర్లు కృష్ణయ్య, స్వర్ణ, నగేష్, చంద్రయ్య, లక్ష్మీ నరసయ్య, శ్రీను, సోమయ్య, ఏడు కోండలు పాల్గొన్నారు.