ఘనంగా శ్రీలక్ష్మీనరసింహుని కల్యాణం
ABN , First Publish Date - 2021-10-29T06:11:20+05:30 IST
మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహ స్వామి క్షేత్రంలో స్వామి వారి నిత్య కల్యాణాన్ని వేద పండితులు గురువారం కన్నుల పండువగా నిర్వహిం చారు.
మఠంపల్లి, అక్టోబరు 28: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహ స్వామి క్షేత్రంలో స్వామి వారి నిత్య కల్యాణాన్ని వేద పండితులు గురువారం కన్నుల పండువగా నిర్వహిం చారు. పూజల అనంతరం కల్యాణాన్ని అత్యంత వైభవంగా జరిపించారు. మహానివేదన అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త చెన్నూరి మట్టపల్లిరావు, విజయ్కుమార్, ఈవో సిరికొండ నవీన్, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.