భక్తిశ్రద్ధలతో గంగదేవమ్మ జాతర
ABN , First Publish Date - 2021-11-23T06:48:52+05:30 IST
మండలంలోని పర్సాయపల్లి గ్రామంలో రెండు రోజుల నుంచి గంగదేవమ్మ జాతరను యాదవసంఘం ఆధ్వ ర్యంలో భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహిస్తున్నారు.
![భక్తిశ్రద్ధలతో గంగదేవమ్మ జాతర](https://media.andhrajyothy.com/appimg/galleries/1921112301165036/11232021011841n21.jpg)
అర్వపల్లి, నవంబరు 22: మండలంలోని పర్సాయపల్లి గ్రామంలో రెండు రోజుల నుంచి గంగదేవమ్మ జాతరను యాదవసంఘం ఆధ్వ ర్యంలో భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహిస్తున్నారు. దేవాలయంలో తుంగ తుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్, జడ్పీటీసీ దావుల వీరప్రసాద్ యాదవ్ డోలుమోగించి అమ్మవారికి నిర్వహించిన పూజల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మన్నె రేణుకలక్ష్మీనర్సయ్యయాదవ్, జడ్పీటీసీ దావుల వీరప్రసాద్యాదవ్, సర్పంచ్ పుప్పాల శేఖర్, ఎంపీటీసీ గీతా సురేష్, గుండగాని సోమేష్గౌడ్, ఎర్రనర్సయ్య, లింగయ్య పాల్గొన్నారు.