అనాథలైన పిల్లలకు రూ.50 వేల ఆర్థికసాయం
ABN , First Publish Date - 2021-12-03T06:06:38+05:30 IST
రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన చిన్నారులు ఆయేషా, హాసియాలకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రూ.50 వేల ఆర్థికసాయం అందజేశారు.
కోదాడ, డిసెంబరు 2 : రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన చిన్నారులు ఆయేషా, హాసియాలకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రూ.50 వేల ఆర్థికసాయం అందజేశారు. ఈ సందర్భంగా పీసీసీ రాష్ట్ర కార్యదర్శి చింతకుంట్ల లక్ష్మీనారాయణరెడ్డి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులకు కోల్పోయిన పిల్లలకు కాంగ్రెస్ పార్టీ అన్నివిధాలా అండగా ఉంటుందన్నారు. భవిష్యత్లో వారి చదువులకు ఆటంకం లేకుండా చూస్తామన్నారు. కార్యక్రమంలో వంగవీటి రామారావు, కందుల కోటేశ్వరరావు, పాలకి అర్జున్, కర్రి సుబ్బరావు, షాబుద్థీన్, లంకెల రమానిరంజన్రెడ్డి, డేగ శ్రీధర్, పాలూరి, రజనీకాంత్, గరిణే శ్రీథర్ తదితరులు పాల్గొన్నారు.