చట్టాలపై అవగాహన కల్పించేందుకే దేవరకొండలో 6న ఎగ్జిబిషన్
ABN , First Publish Date - 2021-10-29T06:19:12+05:30 IST
చట్టాలపై ప్రజలకు అవగాహణ కల్పించేందుకు నవంబరు 6న దేవరకొండ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో ఎగ్జిబిషన్ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి జి.వేణు తెలిపారు.
జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి వేణు
దేవరకొండ, అక్టోబరు 28: చట్టాలపై ప్రజలకు అవగాహణ కల్పించేందుకు నవంబరు 6న దేవరకొండ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో ఎగ్జిబిషన్ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి జి.వేణు తెలిపారు. స్థానిక మున్సి్ఫకోర్టును గురువారం సందర్శించిన అనంతరం, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, స్థానిక కోర్టు న్యాయమూర్తులతో కలిసి పాఠశాల స్థలాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా రాజ్యాంగం కల్పించిన చట్టాలపై ప్రతీ ఒక్కరికి అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని 22శాఖల అధికారులతో దేవరకొండలో 6న ఎగ్జిబిషన్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలతోపాటు చట్టాలపై ఎగ్జిబిషన్లో ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో పేర్కొన్నారు. కలెక్టర్ ప్రశాంత్జీవన్ పాటిల్, జిల్లా జడ్జి రమేష్ తదితరులు పాల్గొంటారని తెలిపారు. ఆయన మున్సి్ఫకోర్టు జడ్జీలు అజయ్, రవీందర్, న్యాయవాదులు శ్రీనివా్సరెడ్డి, రమాశంకర్, ఉమామహేష్, లోహిత్రెడ్డి, అశోక్, తదితరులు ఉన్నారు.