పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి అభిమతం కావాలి
ABN , First Publish Date - 2021-10-29T06:20:00+05:30 IST
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి అభిమతం కావాలని ఎంజీయూ ఎన్ఎ్సఎ్స కోఆర్డినేటర్ డాక్టర్ దోమల రమేష్ అన్నారు.
నల్లగొండ క్రైం, అక్టోబరు 28: పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి అభిమతం కావాలని ఎంజీయూ ఎన్ఎ్సఎ్స కోఆర్డినేటర్ డాక్టర్ దోమల రమేష్ అన్నారు. స్వచ్ఛ భారత్ క్లీన్ ఇండియాలో భాగంగా ఎంజీయూ ఎన్ఎ్సఎ్స విభా గం ఆధ్వర్యంలో పట్టణంలోని గడియారం సెంటర్ నుంచి ప్రకాశంబజార్ వరకు క్లీన్ ఇండియా కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్ఎ్సఎ్స వలంటీర్లతో కలిసి రోడ్డు వెంట ఉన్న చెత్తను, వాటర్ బాటిళ్లను తొలగించి శుభ్రం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రజలంతా స్వచ్ఛందంగా క్లీన్ ఇండియా కార్యక్రమంలో భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పర్యావరణ వేత్త మిట్టపల్లి సురే్షగుప్త మాట్లాడుతూ, ఇలాంటి కార్యక్రమాలను ఒకరోజుతో సరిపెట్టకుండా వారానికి రెండు రోజులు నిర్వహిస్తూ ప్రజలను కూడా భాగస్వాములుగా చేసేలా కృషి చేయాలని కోరారు.