నల్లచట్టాల అంతం.. కార్మికుల, కర్షకుల పంతం
ABN , First Publish Date - 2021-09-02T07:00:11+05:30 IST
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను అంతమొందించే వరకు కార్మికులు, కర్షకులు ఐక్యతతో పోరాడాలని సినీ నటుడు డైరెక్టర్ ఆర్.నారాయణమూర్తి అన్నారు.
- సినీ నటుడు నారాయణమూర్తి
హాలియా, సెప్టెంబరు 1: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను అంతమొందించే వరకు కార్మికులు, కర్షకులు ఐక్యతతో పోరాడాలని సినీ నటుడు డైరెక్టర్ ఆర్.నారాయణమూర్తి అన్నారు. బుధవారం హాలియాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2006లో స్వామినాథన్ కమిటీ సిఫారసులు తీసుకొచ్చినా నేటి వరకు పాలకులు అమలు పర్చడం లేదని, 44 కార్మిక చట్టాలను సవరించి వారి శ్రమను దోచి కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పుతున్నట్లు తెలిపారు. రైతుల పోరాటానికి మద్దతు తెలపాలని కోరారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు కూన్రెడ్డి నాగిరెడ్డి, కొండేటి శ్రీను, అవుతా సైదులు, శంకర్నాయక్, రామచంద్రయ్య, వెంకటేశ్వర్లు, వెంకన్న, రవినాయక్, ఏసు, యాదయ్య, శ్రీను, జాని, రవి, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.