రక్తదానం చేసి, ప్రాణదాతలు కావాలి
ABN , First Publish Date - 2021-01-13T06:15:16+05:30 IST
రక్తాన్ని కృత్రిమంగా తయారు చేయలేమని, ప్రతి ఒక్కరు జీవితంలో ఒక్కసారైనా రక్తదానం చేసి మరొకరికి ప్రాణదాతలుగా నిలువాలని రెడ్క్రాస్ జిల్లా చైర్మన్ డాక్టర్ జి.లక్ష్మినర్సింహారెడ్డి అన్నారు.
![రక్తదానం చేసి, ప్రాణదాతలు కావాలి](https://media.andhrajyothy.com/appimg/galleries/2021011312433010/01132021004507n21.jpg)
రెడ్క్రాస్ జిల్లా చైర్మన్ డాక్టర్ లక్ష్మీనర్సింహారెడ్డి
48 సార్లు రక్తదానం చేసిన సుబ్రహ్మణ్యశర్మ
రిటైర్డు ఉపాధ్యాయుడు సుబ్రమణ్యశర్మ మోత్కూరులో నిర్వహించిన రక్తదానం శిబిరంలో రక్తదానం చేసి 48వ సారి రక్తదానం చేసిన వ్యక్తిగా నిలిచారు. మరో ఉపాధ్యాయుడు టి.ఉప్పలయ్య ఈ శిబిరంలో 25వ సారి రక్తదానం చేశారు. కార్యక్రమంలో ఏపీవో కరుణాకర్, ఆయా సంస్థల ప్రతినిధులు కె.ప్రభాకర్రెడ్డి, ఎస్ఎన్చారి, శ్రీనివా్సరెడ్డి, గౌరు శ్రీనివాస్, బి.రాజు, బి.చంద్రశేఖర్, ఎం.అంజయ్య, మత్స్యగిరి, దశరథ, కె.మహేందర్, జి.సోమనర్సయ్య, జితేందర్రెడ్డి, అనిల్ పాల్గొన్నారు.