రోడ్డు ప్రమాదంలో దివీస్ ఉద్యోగి మృతి
ABN , First Publish Date - 2021-11-28T05:48:25+05:30 IST
రోడ్డు ప్రమాదంలో దివీస్ పరిశ్రమ ఉద్యోగి దుర్మర ణం చెందాడు.

చౌటుప్పల్ రూరల్, నవంబరు 27: రోడ్డు ప్రమాదంలో దివీస్ పరిశ్రమ ఉద్యోగి దుర్మర ణం చెందాడు. పోలీసులు తెలిపి న వివరాల ప్రకారం.. కృష్ణా జి ల్లా గుడివాడ మండలం చౌదరిపేటకు చెందిన సత్యసాయి బా లాజీ (28) దివీస్ పరిశ్రమంలో కొంతకాలంగా ఉద్యోగం చేస్తున్నా డు. శుక్రవారం రాత్రి హైదరాబా ద్ వైపు వెళ్తున్న లారీ సడన బ్రే కులు వేశారు. దీంతో వెనుక నుంచి ద్విచక్ర వాహనంపై వస్తున్న బాలాజీ లారీని ఢీకొట్టా డు. ఈ ప్రమాదంలో బాలాజీ అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.