అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి : జడ్పీ సీఈవో
ABN , First Publish Date - 2021-07-30T06:03:40+05:30 IST
అభివృద్ధి పనులు వేగవంతంగా చేయాలని జిల్లా పరిషత్ సీఈవో నంద్యాల ప్రేమ్కరుణ్రెడ్డి కోరారు.
హుజూర్నగర్ రూరల్/ చిలుకూరు/ తిరుమలగిరి రూరల్, జూలై 29: అభివృద్ధి పనులు వేగవంతంగా చేయాలని జిల్లా పరిషత్ సీఈవో నంద్యాల ప్రేమ్కరుణ్రెడ్డి కోరారు. హుజూర్నగర్ మండలంలోని వేపలసింగారంలో పల్లె ప్రగతి, డంపింగ్ యార్డు, వైకుంఠ ధామాలను గురువారం పరిశీలించారు. అభివృద్ధి పనుల్లో అలసత్వం తగదన్నారు. రోడ్ల వెంట ఉన్న మొక్కలను కాపాడాలన్నారు. ప్రభుత్వం చేపట్టిన ప్రగతి పనులు పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్రెడ్డి, సర్పంచ్ శిరీషకొండారెడ్డి, శైలజ, నాగమణి, హరిలీల, రామ్మోహన్రెడ్డి, వరలక్ష్మీ, రామిరెడ్డి పాల్గొన్నారు. చిలుకూరులో మెగా పల్లెప్రకృతి వనం పనులను ఎం పీపీ ప్రశాంతికోటయ్య ప్రారంభించారు. 10ఎకరాల్లో రూ.43 లక్షలతో మెగా పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపా రు. కార్యక్రమంలో ఎంపీడీవో ఈదయ్య, తహసీల్దార్ రాజేశ్వరి, ఎంపీవో ముక్కపాటి, డీసీసీబీ డైరెక్టర్ కొండా సైదయ్య, సర్పంచ్ కొడారి బాబు, ఎంపీటీసీలు రమణనాగయ్య, కల్యాణి కోటేష్, దొడ్డా సురేష్ పాల్గొన్నారు. అనంతరం జడ్పీ సీఈవో ప్రేమ్కుమార్రెడ్డి, అడిషనల్ పీడీ సురేష్ పనులను పరిశీలించారు. తిరుమలగిరి మండలం మామిడాలలో ఏర్పాటు చేయనున్న మెగా పల్లె ప్రకృతి వనం పనులను ఎంపీడీవో మారయ్య పరిశీలించారు. కార్యక్రమం లో సర్పంచ్ కర్ణాకర్, పంచాయతీ కార్యదర్శి అశోక్ పాల్గొన్నారు.