ప్రతీవార్డులో రూ.30లక్షలతో అభివృద్ధి

ABN , First Publish Date - 2021-10-25T05:56:22+05:30 IST

జిల్లా కేంద్రం భువనగిరి మునిసిపాలిటీ సమగ్ర అభివృద్ధే టీఆర్‌ఎస్‌ లక్ష్యమని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

ప్రతీవార్డులో రూ.30లక్షలతో అభివృద్ధి
భువనగిరిలో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి

ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి 

భువనగిరిటౌన, అక్టోబరు 24: జిల్లా కేంద్రం భువనగిరి మునిసిపాలిటీ సమగ్ర అభివృద్ధే టీఆర్‌ఎస్‌ లక్ష్యమని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. త్వరలో ఒ క్కో వార్డుకు రూ.30 లక్షలు కేటాయించి 35 వార్డుల్లో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. పెద్ద చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా మార్చనున్నట్లు, క్రీడా వసతులు కల్పించనున్నట్లు, పట్టణ అభివృద్ధికి అవసరమైన అన్ని ప నులను చేపట్టనున్నట్లు తెలిపారు. టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండాలని సూచించారు. జడ్పీచైర్మన ఎలిమినేటి సందీ ప్‌ రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు అ ర్హులైన అందరికీ అందేలా టీఆర్‌ఎస్‌ శ్రేణులు కృషి చేయాలన్నారు. ముందు గా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. గజమాలతో ఎమ్మెల్యేను సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు టీఆర్‌ఎ స్‌లో చేరారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్మన ఎనబోయిన ఆంజనేయులు, వైస్‌చైర్మన కిష్టయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన జడల అమరేందర్‌గౌడ్‌, టీఆర్‌ఎస్‌ పట్టణ శాఖ అధ్యక్ష, కార్యదర్శులు కిరణ్‌కుమార్‌, శ్రీనివా్‌సరెడ్డి పాల్గొన్నారు. 

భూదానపోచంపల్లి: వరంగల్‌లో నవంబరు 15న నిర్వహించే టీఆర్‌ఎస్‌ విజయగర్జన సభను విజయవంతం చేయాలని ఆ పార్టీ ప ట్టణ అధ్యక్షుడు సీత వెంకటేశం అన్నారు. ఆదివారం పట్టణంలోని ఓ ప్రైవేటు ఫంక్షన హాల్‌ లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశంలో మున్సిపల్‌ చైర్‌పర్సన చిట్టిపోలు విజయలక్ష్మి, వైస్‌చైర్మన బాత్క లింగస్వామి, కౌన్సిలర్లు మల్లారెడ్డి, మధు, చక్రపాణి, అఖిలబలరాం, కుమార్‌, నాయకులు మల్లేశంగౌడ్‌, చంద్రంయాదవ్‌, యాదగిరి, బాలచంద్రంగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. 

బొమ్మలరామారం: మండలకేంద్రంలోని మాతృశ్రీ గ్రా మర్‌ ప్రైవేట్‌ పాఠశాల ఆవరణలో ఆదివారం టీఆర్‌ఎస్‌ పార్టీ సమావేశాన్ని ఆ పార్టీ  మండల అధ్యక్షుడు పొలగౌని వెంకటే్‌షగౌడ్‌, ఎంపీపీ చిమ్ముల సుధీర్‌రెడ్డి ఆధ్వర్యంలో జ రిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బహిరంగ స భకు ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో పీ ఏసీఎస్‌ చైర్మన గూదె బాల నర్సయ్య, మండల ఉపాధ్యక్షుడు మన్నె శ్రీధర్‌, నాయకులు ధీరావత పాశ్యనాయక్‌, నరేందర్‌రెడ్డి, బట్కీరు బీరప్ప, బాల్‌సింగ్‌ నాయక్‌, సాయికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.  



Updated Date - 2021-10-25T05:56:22+05:30 IST