జల రక్షణలో భాగంగానే కార్డన్‌ సెర్చ్‌

ABN , First Publish Date - 2021-11-28T05:37:11+05:30 IST

: ప్రజల రక్షణలో భాగంగా, అసాంఘిక కార్యకలాపాల అణచివేతకు కార్డన్‌సెర్చ్‌ నిర్వహిస్తున్నట్లు డీఎస్పీ మోహన్‌కుమార్‌ అన్నారు.

జల రక్షణలో భాగంగానే కార్డన్‌ సెర్చ్‌
రాజీవ్‌నగర్‌ వాసులతో మాట్లాడుతున్న డీఎస్పీ మోహన్‌కుమార్‌

ప్రసూర్యాపేటక్రైం, నవంబరు 27: ప్రజల రక్షణలో భాగంగా, అసాంఘిక కార్యకలాపాల అణచివేతకు కార్డన్‌సెర్చ్‌ నిర్వహిస్తున్నట్లు డీఎస్పీ మోహన్‌కుమార్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని రాజీవ్‌నగర్‌లో శనివారం కార్డన్‌సెర్చ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పౌరుడు యూనిఫాం లేని పోలీస్‌ అని అన్నారు. కార్డన్‌సెర్చ్‌తో ప్రజలకు భరోసా పెరుగుతుందన్నారు. కార్డన్‌సెర్చ్‌లో రెండు బెల్ట్‌షాపులు, రూ.19వేల మద్యం సీజ్‌ చేశామన్నారు. సరైన పత్రాలు లేని 18 ద్విచక్రవాహనాలు, ఆటోసీజ్‌ చేశామన్నారు. 85మంది సిబ్బంది, 350 నివాసాలు తనిఖీ చేశారు. కార్యక్రమంలో పట్టణ సీఐ పాల్గొన్నారు. 


Updated Date - 2021-11-28T05:37:11+05:30 IST