‘విజ్ఞాన’లో రక్తదాన శిబిరం

ABN , First Publish Date - 2021-12-25T06:32:52+05:30 IST

మండల పరిధిలోని విజ్ఞాన ఇనస్టి ట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స (విట్స్‌)లో ఎన్టీఆర్‌ ట్రస్ట్‌, విట్స్‌ ఎనఎ్‌సఎ్‌స విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం రక్తదాన శిబిరం నిర్వహించారు.

‘విజ్ఞాన’లో రక్తదాన శిబిరం
రక్తదానం చేస్తున్న అధ్యాపకులు, సిబ్బంది


భూదానపోచంపల్లి, డిసెంబరు 24 : మండల పరిధిలోని  విజ్ఞాన ఇనస్టి ట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స (విట్స్‌)లో ఎన్టీఆర్‌ ట్రస్ట్‌, విట్స్‌ ఎనఎ్‌సఎ్‌స విభాగం ఆధ్వర్యంలో  శుక్రవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. సుమారు 180 మంది విద్యార్థులు, అధ్యాపకులు రక్తదానం చేశారు. ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ప్రతిని ధులు డాక్టర్‌ వంశీ, పీఆర్‌వో శశిధర్‌ మాట్లాడుతూ మానవసేవయే - మాధవ సేవగా ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోందన్నారు. కార్యక్ర మంలో విజ్ఞాన సంస్థల సీఈవో బోయపాటి శ్రావణ్‌, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ జి.దుర్గసుకుమార్‌, డీన మాధవి, ప్రోగాం ఆఫీసర్‌, ఎనఎ్‌సఎ్‌స విభాగం ఇనచార్జి కె.బాలయ్య, విద్యార్థులు పాల్గొన్నారు.  


Updated Date - 2021-12-25T06:32:52+05:30 IST