బీజేపీ పట్టణ కార్యదర్శి మృతి
ABN , First Publish Date - 2021-10-19T06:39:36+05:30 IST
ఆలేరు పట్టణ బీజేపీ కార్యదర్శి లక్కాకుల మహేందర్(35) పస్కల్ వ్యాధితో హైదరా బాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు.
![బీజేపీ పట్టణ కార్యదర్శి మృతి](https://media.andhrajyothy.com/appimg/galleries/1921101901072023/10192021010913n19.jpg)
ఆలేరు, అక్టోబరు 18: ఆలేరు పట్టణ బీజేపీ కార్యదర్శి లక్కాకుల మహేందర్(35) పస్కల్ వ్యాధితో హైదరా బాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. మహేందర్కు తల్లిదండ్రు లు, భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మహేందర్ మృతికి పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండ్రు శోభారాణి, జిల్లా అధ్యక్షుడు శ్యాంసుందర్ రావు, మండల, పట్టణ అధ్యక్షులు దూసరి రాఘవేందర్, బడుగు జహంగీర్, నాయకులు బందెల సుభాష్, మహేశ్, సంగు భూపతి, శ్రీనివాస్, సిద్దిలింగం, కటకం రాజు సంతాపం తెలిపారు.