బావ చేతిలో బావమరిది హతం
ABN , First Publish Date - 2021-12-25T06:31:32+05:30 IST
బావ చేతిలో బావమరిది హతమయ్యాడు. ఈ సంఘటన తుర్కపల్లి మండలం మాదాపూర్ గ్రామంలో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది.
అక్కను తరచూ వేధిస్తుండడంతో ఇరువురి మధ్యన ఘర్షణ
ఇటుకతో తలపై మోదిన బావ
ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి
తుర్కపల్లి, డిసెంబరు 24: బావ చేతిలో బావమరిది హతమయ్యాడు. ఈ సంఘటన తుర్కపల్లి మండలం మాదాపూర్ గ్రామంలో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఎర్రవెల్లి వెంకటేష్, మాందాల గ్రామానికి చెందిన కృష్ణవేణితో 11 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికిదంపతులకు ముగ్గురు కుమారులు ఉన్నారు. కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మూడు రోజులుగా భార్యాభర్తలు గొడవపడ్డారు. కృష్ణవేణి భర్త వెంకటేష్, ఇంట్లో జరిగిన గొడవ గురించి అత్తగారింట్లో ఉన్న బంధువులకు సమాచారం ఇచ్చాడు. ఈ నేపఽథ్యంలో వెంకటేష్ బావమరిది రాచకొండ రమేష్(30) మాదాపూర్ గ్రామానికి వచ్చాడు. ఇంట్లో జరిగిన గొడవపై ఆరాతీశాడు. మద్యం తాగి తన అక్కను తరచూ వేధిస్తున్నావని బావతో గొడవపడ్డాడు. ఇద్దరి మధ్య మాటామాట పెరిగి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. బావ వెంకటేష్ ఇటుకతో బావమరిది తలపై మోదడంతో అతడికి తీవ్రగాయమైంది. వెంటనే అతడిని చికిత్స అందించేందుకు తుర్కపల్లి పీహెచసీకి తీసుకువచ్చారు. ప్రాథమిక చికిత్స అందిన తర్వాత కొద్దిసేపటికి ఛాతిలో తీవ్రమైన నొప్పి వస్తోందని చెప్పడంతో రమే్షను భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. కాగా ఈ ఘటనపై ఎటువంటి ఫిర్యాదు చేయలేదు.