ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం
ABN , First Publish Date - 2021-10-18T05:50:25+05:30 IST
మండలంలోని జీఎడవల్లి గ్రామ ఉన్నత పాఠశాల 2003-04 ఎస్ఎ్ససీ బ్యాచ విద్యార్థులు పూర్వ విద్యార్థులు సమ్మేళనాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు.
కనగల్, అక్టోబరు 17 : మండలంలోని జీఎడవల్లి గ్రామ ఉన్నత పాఠశాల 2003-04 ఎస్ఎ్ససీ బ్యాచ విద్యార్థులు పూర్వ విద్యార్థులు సమ్మేళనాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుని యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం తమకు విద్యాబద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో నాటి ఉపాధ్యాయులు నర్సింహారా వు, దామోదర్, శంకరయ్య, నాగయ్య, విష్ణుదేవి, దుర్గాభవాని, విద్యార్థులు పాల్గొన్నారు.
చిట్యాల : చిట్యాల జడ్పీహెచఎ్స 1994-95బ్యాచ విద్యార్థులు ఆత్మీయ సమావేశం జరుపుకున్నారు. ఈ సందర్భంగా తమకు పాఠాలు బోధించిన గురువులను సన్మానించారు. అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న కొంతమంది విద్యార్థులకు ఆర్థిక సాయం అందించారు. కార్యక్రమంలో కోనేటి ఎల్లయ్య, దాసరి నర్సింహ, కూరెళ్ల లింగస్వామి, శేపూరి శైలజ, వరకాంతం శ్రీను పాల్గొన్నారు.
శాలిగౌరారం : శాలిగౌరారం జడ్పీహెచఎస్ 1998-99బ్యాచ విద్యార్థులు గ్రామంలో ఆదివారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా తమకు విద్యను బోధించిన ఉపాధ్యాయులను సన్మానించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాదూరి శ్రీనివాస్రెడ్డి, శ్యామల రాంరెడ్డి, యుగేంద్రాచారి, వెంకటయ్య, పూర్వ విద్యార్థులు కూరం లింగయ్య, అబ్ధుల్ సలామ్, అశ్వినికుమార్, మురళీధర్, రామకృష్ణారెడ్డి, వీరస్వామి, రమేష్, శివశంకర్, ఉపేందర్, కిరణ్, మల్సూర్, డెంకెల వెంకటమ్మ, చిర్రబోయిన విమల, శైలజ, రేణుక, భద్రమ్మ ఉన్నారు.