50 కిలోల రేషన్ బియ్యం స్వాధీనం
ABN , First Publish Date - 2021-08-10T07:44:56+05:30 IST
అక్రమంగా నిల్వ చేసిన 50 కిలోల రేషన్ బియ్యాన్ని ఎస్వోటీ పోలీసులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు.
![50 కిలోల రేషన్ బియ్యం స్వాధీనం](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
యాదాద్రి రూరల్, ఆగస్టు 9: అక్రమంగా నిల్వ చేసిన 50 కిలోల రేషన్ బియ్యాన్ని ఎస్వోటీ పోలీసులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. సీఐ జానకిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక బీసీ కాలనీకి చెందిన కావడి నర్సింహ, పుడుత రమేష్ ఇళ్లల్లో ఎస్వోటీ పోలీసులు దాడి చేసి 50 కిలోల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.