ఆహ్వానం హోటల్ లైసెన్స్ రద్దు చేస్తా
ABN , First Publish Date - 2021-07-31T04:37:32+05:30 IST
ఆహార పదార్ధాల తయారీలో నాణ్యత పాటించాలని జిల్లా ఆహార పరిరక్షణ అధికారి ధర్మేందర్ సూచించారు.
సంగారెడ్డి అర్బన్, జూలై 30: ఆహార పదార్ధాల తయారీలో నాణ్యత పాటించాలని జిల్లా ఆహార పరిరక్షణ అధికారి ధర్మేందర్ సూచించారు. సంగారెడ్డి పోతిరెడ్డిపల్లి చౌరస్తా సమీపంలోని ఆహ్వానం హోటల్లో శుక్రవారం తనిఖీలు చేశారు. హోటల్లో కలియతిరిగి తయారు చేసిన ఆహార పదార్ధాలు, వంట సామగ్రిని పరిశీలించారు. మంచి నూనె నాణ్యతను పరికరం ద్వారా పరీక్షించారు. మంచి నూనె పలుమార్లు వాడినట్లు తేలడంతో నూనెను పారబోశారు. అంతేకాకుండా కుళ్లిన కూరగాయలను బయట పారబోశారు. ఈ సందర్బంగా ధర్మేందర్ మాట్లాడుతూ హోటల్లో శుభ్రత పాటించాలని..14 రోజుల్లో హోటల్ చక్కబెట్టుకోకపోతే ఫుడ్ సేప్టీ లైసెన్స్ రద్దు చేస్తానని హెచ్చరించారు. హోటల్లో సేకరించిన శాంపిళ్లను ల్యాబ్కు పంపిస్తామని కల్తీ ఉన్నట్లు తేలితే కేసులు నమోదు చేస్తామన్నారు.