తూము విప్పడంతో నీరు వృథా
ABN , First Publish Date - 2021-01-16T06:05:13+05:30 IST
వెల్దుర్తిలో కుడిచెరువు తూమును గుర్తు తెలియని వ్యక్తులు గురువారం తెల్లవారుజామున విప్పడంతో సాగునీరు వృథాగా పోయింది.
గుర్తుతెలియని వ్యక్తుల నిర్వాకం
వెల్దుర్తి జనవరి 15: వెల్దుర్తిలో కుడిచెరువు తూమును గుర్తు తెలియని వ్యక్తులు గురువారం తెల్లవారుజామున విప్పడంతో సాగునీరు వృథాగా పోయింది. దీంతో గ్రామ సర్పంచ్ భాగ్యలక్ష్మి ఆంజనేయులు మరమ్మతులు చేయించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి చెరువు నిండడంతో యాసంగి సాగుకు సన్నద్ధమవుతున్న తరుణంలో గుర్తుతెలియని వ్యక్తులు ఇష్టారాజ్యంగా వదలడంతో 25 శాతం సాగునీరు వృఽథాగా పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.