రోడ్డును ఆక్రమిస్తూ డబ్బాల ఏర్పాటుతో ట్రాఫిక్ సమస్య
ABN , First Publish Date - 2021-10-26T04:28:07+05:30 IST
జిల్లా కేంద్రంలో రోజురోజుకూ ట్రాఫిక్ సమస్యలు పెరుగుతుండగా, ప్రధాన రోడ్డు సైతం ఆక్రమణకు గురవుతున్నది.

మెదక్ మున్సిపాలిటీ, అక్టోబరు 25: జిల్లా కేంద్రంలో రోజురోజుకూ ట్రాఫిక్ సమస్యలు పెరుగుతుండగా, ప్రధాన రోడ్డు సైతం ఆక్రమణకు గురవుతున్నది. పట్టణంలోని రాందా్సచౌరస్తా వద్ద ఇరుకుగా ఉన్న జేఎన్రోడ్డు రహదారిలో కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు డబ్బాలను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య మరింత తీవ్రతరమవుతున్నది. స్థానికులు కమిషనర్కు ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకోలేదు. టౌన్ ప్లానింగ్ అధికారులు వెంటనే స్పందించి డబ్బాలను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.