‘లక్ష ఉద్యోగాలను భర్తీ చేయాలి‘
ABN , First Publish Date - 2021-07-26T03:41:31+05:30 IST
రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న లక్ష ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ రాష్ట్ర టీఎన్జీవో దేవాదాయశాఖ ఉద్యోగుల సమావేశం ఆదివారం పాపన్నపేట మండలం ఏడుపాయలలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగి మరణిస్తే ఫ్యామిలీ పెన్షన్ అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
పాపన్నపేట, జూలై 25 : రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న లక్ష ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ రాష్ట్ర టీఎన్జీవో దేవాదాయశాఖ ఉద్యోగుల సమావేశం ఆదివారం పాపన్నపేట మండలం ఏడుపాయలలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగి మరణిస్తే ఫ్యామిలీ పెన్షన్ అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈహెచ్ఎ్సను మరింత బలోపేతంచేసి ఉద్యోగులందరికీ మెరుగైన వైద్యం అందజేయాలన్నారు. పీఆర్సీ నిబంధనల ప్రకారం ఉద్యోగులకు కార్పొరేట్ వైద్యసేవలు అందించాలని విన్నవించారు. దేవాదాయశాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యల పరిష్కారం కృషిచేస్తామన్నారు. కార్యక్రమంలో మెదక్ జిల్లా టీఎన్జీవో అధ్యక్షుడు డి.నరేందర్, కార్యదర్శి రాజ్కుమార్, వివిధ జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.