తూప్రాన్లో యువకుడి అదృశ్యం
ABN , First Publish Date - 2021-05-06T05:36:54+05:30 IST
ఇంట్లోంచి పనికి వెళ్లిన యువకుడు అదృశ్యమయ్యాడు.
తూప్రాన్, మే 5: ఇంట్లోంచి పనికి వెళ్లిన యువకుడు అదృశ్యమయ్యాడు. ఈ సంఘటన తూప్రాన్ పట్టణంలో బుధవారం వెలుగు చూసింది. తూప్రాన్-2 ఎస్ఐ యాదగిరిరెడ్డి తెలిపిన ప్రకారం.. దుండిగల్ మండలం నాగువార్ గ్రామానికి చెందిన తుడుం రేణుక తన భర్తతో మనస్పర్థల కారణంగా ఐదేళ్ల నుంచి కుమారుడు తుడుం మధుసూదన్ (21)తో కలిసి తూప్రాన్ పట్టణంలో ఉంటున్నది. గతనెల 28న మనోహరాబాద్ మండలం కూచారంలో బంధువు చనిపోవడంతో తూప్రాన్లోనే ఉంటున్న సోదరి గజ్జెల బుచ్చమ్మతో కలిసి వెళ్లింది. ఆ సమయంలో మధుసూదన్, బుచ్చమ్మ కుమారుడైన మురళితో కలిసి ఉంట్లోనే ఉన్నారు. రాత్రి తిరిగి వచ్చిన వారికి ఇంట్లో మధుసూదన్ కనిపించలేదు. ఈ విషయమై మురళిని ప్రశ్నించగా, పనికి వెళ్తున్నానంటూ మధ్యాహ్నం ఇంట్లోంచి వెళ్లాడని చెప్పాడు. చుట్టుపక్కల వెతికినప్పటికీ ఆచూకీ లభించలేదు. మధుసూదన్ మొబైల్ స్విచాఫ్ వస్తున్నట్లు కుటుంబీకులు వివరించారు. తల్లి రేణుక ఫిర్యాదు మేరకు బుధవారం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ యాదగిరిరెడ్డి వివరించారు.