అరికపూడి రఘుకు తెలంగాణ సేవారత్న అవార్డు
ABN , First Publish Date - 2021-11-22T04:41:30+05:30 IST
బీడీఎల్ విన్నర్స్ ఫౌండేషన్ అధ్యక్షుడు అరికపూడి రఘుకు తెలంగాణ సేవారత్న అవార్డు లబించింది.

పటాన్చెరు రూరల్, నవంబరు 21: బీడీఎల్ విన్నర్స్ ఫౌండేషన్ అధ్యక్షుడు అరికపూడి రఘుకు తెలంగాణ సేవారత్న అవార్డు లబించింది. మాతృదేవోభవ అనాథ ఆశ్రమ సంస్థ మూడో వార్షికోత్సవం కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. కరోనా సమయంలో రఘు అందించిన సేవలను సంస్థ గుర్తించింది. దీంతో తెలంగాణ సేవారత్న అవార్డును రఘుకు బడంపేట మేయర్ శ్రీమతి పారిజాత నర్సింహరెడ్డి అందజేశారు.